NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` మూవీతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయ కీలక పాత్రను పోషించారు. ఎం. ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు.
అలాగే ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్గా, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా అలరించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం మార్చి 25న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్, చరణ్లతో సంగీత దర్శకుడు కీరవాణి చిట్ చాట్ చేశారు.
ఈ సందర్భంగా కీరవాణి తాను కంపోజ్ చేసిన చెత్త పాటను చెప్పమని హీరోలిద్దరినీ అడిగాడు. అందుకు కాస్త ఆలోచించిన ఎన్టీఆర్.. నాగార్జున హీరోగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన `ఘరానా బుల్లోడు` సినిమాలో `భీమవరం బుల్లోడా పాలు కావాలా` సాంగ్ తనకు అస్సలు నచ్చదని.. ఆ పాట వింటేనే చిరాకు వస్తుందని ముఖంపైనే చెప్పేశాడు.
మరోవైపు రామ్ చరణ్ తనకు ఇష్టం లేని పాటను చెప్పడానికి ప్రయత్నించాడు కానీ.. గుర్తులేకపోవడం వల్ల ప్రశ్న దాటేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.