NTR Jr: సినిమా తెలుగు ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ వివిధ సినిమాలలో నటించి ఎంతోమంది ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్నాడు. వెండితెరపై ఎంతో సందడి చేసిన ఎన్టీఆర్ బుల్లితెరపై కూడా బిగ్ బాస్ వంటి రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించి, ఆ రియాలిటీ షోను ఎంతో విజయవంతం చేసి బుల్లితెరపై కూడా తన విశ్వ రూపాన్ని చూపించాడు.అయితే తాజాగా ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
ఇదివరకే స్టార్ మాలో ప్రసారమైన “మీలో ఎవరు కోటీశ్వరుడు” కార్యక్రమాన్ని నాగార్జున హోస్ట్ గా నిర్వహించారు. నాగార్జున చేసిన రెండు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే మూడవ సీజన్ కి హోస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరించారు.అయితే ఆ సమయంలో ఈ షో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో స్టార్ మా కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలోనే జెమిని ఛానల్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆసక్తి చూపారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
ఎన్టీఆర్ ముందు ఉన్న అతిపెద్ద టార్గెట్ ఇదే..
ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించడంతో మంచి రేటింగ్స్ ను సంపాదించుకుంది. అయితే ఎన్టీఆర్ నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం కూడా అంతకు మించి రేటింగ్స్ సంపాదిస్తుందనే నమ్మకం ప్రేక్షకులలో ఉంది. ఇప్పటికే బిగ్ బాస్ వంటి కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసిన తారక్ కు ఇది పెద్ద విషయం కాదని చెప్పవచ్చు.అదేవిధంగా ఈ షో నిర్వహించడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కో ఎపిసోడ్ కు 1.2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం వినబడుతుంది. ఈ షో మొత్తం 30 ఎపిసోడ్లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న త్రిబుల్ ఆర్ సినిమా కన్నా ఎన్టీఆర్ ముందున్న అతిపెద్ద టార్గెట్ “ఎవరు మీలో కోటీశ్వరులు”అనే కార్యక్రమం అని చెప్పవచ్చు. అయితే ఈ షో మే లేదా జూన్ నెల నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.