ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా క్రిష్-బాలయ్యలు తెరకెక్కించిన సినిమా. విడుదలకి ముందు మరో మహానటి సినిమాని చూడబోతున్నాం, ఈ సంక్రాంతి కూడా బాలకృష్ణదే అనే ఫీలింగ్ కలిగించారు. పోస్టర్స్ నుంచి ట్రైలర్ వరకూ మాస్టర్ పీస్ ఇన్ మేకింగ్ అనే టైలర్ మార్క్ స్టాంప్ తో జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
మొదటి షో నుంచే క్లాసిక్ అని, బాలయ్య అన్నగారిని దించేశారని, క్రిష్ అద్భుతంగా తెరకెక్కించాడని అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంది. క్రిటిక్స్ ని సైతం మెప్పించిన ఈ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడని వసూళ్లు రాబడుతుందని, బాలయ్య కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేశాయి. అయితే రిలీజ్ అయ్యాక పరిస్థితి పూర్తిగా తిరగబడింది, వారం రోజులు గడిచినా కూడా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా 25 కోట్ల షేర్ కూడా రాబట్టలేక, బాక్సాఫీస్ దగ్గర చతికల పడింది.
దాదాపు 70 కోట్ల ప్రీరిలీజ్ చేసిన ఈ సినిమా 30కోట్లు రాబట్టినా ఆశ్చర్యమే అనుకునే పరిస్థితి కారణం బాలయ్యక్రిష్ లే. బయోపిక్ అంటే ఒక మనిషి జీవితమంతా చూపించాలి కానీ ఘనతని మాత్రమే చూపిస్తే అందరూ ఇష్టపడరు. కథానాయకుడు సినిమాలో జరిగింది ఇదే. ఇప్పుడు కథానాయకుడు సినిమాని కొన్న బయ్యర్ల ఆశలన్నీ మాయనాయకుడు సినిమాపైనే ఉన్నాయి, అది కూడా పోతే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచే ప్రమాదం ఉంది.