NTR: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అభిమానులను ఎక్కువగా ప్రేమించే హీరో లలో మొదటి వరుసలో ఉండేది యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన ప్రతి ఆడియో ఫంక్షన్… ఇంకా సినిమాకి సంబంధించి ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమంలో నైనా.. అభిమానులు ఇంటికి చాలా జాగ్రత్తగా వెళ్లాలని కచ్చితంగా చెబుతాడు. నాకంటే ఎక్కువగా మీ కుటుంబ సభ్యులు ముఖ్యం.. అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెబుతాడు. అప్పుడప్పుడు అభిమానులకు సహాయాలు కూడా చేస్తూ ఉంటాడు. దీనిలో భాగంగానే తాజాగా శ్రీకాళహస్తికి చెందిన అభిమానికి ఎన్టీఆర్ అండగా నిలబడ్డాడు. శ్రీకాళహస్తికి చెందిన జనార్ధన్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురికావడంతో.. అతనిని స్థానికులు హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే తీవ్రంగా గాయాలు కావటంతో చావు బతుకుల మధ్య ఉన్న జనార్ధన్ కొమాలోకి వెళ్లిపోయారు. వెంటనే స్నేహితులు జనార్ధన్ ఎన్టీఆర్ వీరాభిమాని కావటంతో.. ఏదో రీతిలో.. కష్టపడి తారక్ ..కి తెలియజేయడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో వెంటనే స్పందించిన ఎన్టీఆర్ తన సన్నిహితులతో.. జనార్ధన్ మరియు అతని స్నేహితులను సంప్రదించడం జరిగింది. ఎన్టీఆర్ మాట్లాడుతున్న టైంలో కోమాలో ఉన్న జనార్ధన్ చెవి దగ్గర ఫోన్ పెట్టడంతో… తారక్ మాట్లాడుతూ జనార్ధన్.. ఏం భయపడకు నీకు అండగా మేము అందరం ఉన్నాము. నేను ఎన్టీఆర్ ని మాట్లాడుతున్నాను. త్వరగా కోలుకో… దేవుడి మీద భారం పెట్టు అందరం అండగా ఉన్నాం దేవుడు కూడా తోడుగా ఉంటాడు. నువ్వు త్వరగా కోలుకుని బయటకు వస్తే మళ్ళీ మనం అందరం కలుద్దాం.
నిన్ను చూడాలని నాకు కూడా ఉంది. మన అభిమానులంతా నీకు అండగా ఉన్నారు నువ్వు త్వరగా కోలుకుని బయటకు వస్తావు, నీకేం కాదు అంటూ ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. అయితే ఆ టైంలో కోమాలో ఉన్న జనార్ధన్ ఎన్టీఆర్ మాటలు విని.. కాలు చెయ్యి కదపటం జరిగిందట. అనంతరం జనార్దన్ తల్లితో.. కూడా ఎన్టీఆర్ మాట్లాడటం జరిగింది. జనార్దన్ తల్లికి.. ఎన్టీఆర్ ధైర్యం చెప్పడం జరిగింది. భగవంతుడు తోడుగా ఉన్నాడు జనార్ధానికి ఏమీ కాదు త్వరగా కోలుకొని వస్తాడు అందరం అండగా ఉంటామని ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.