NTR-Ram Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా వపర్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టారఱ్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయం సాధించింది. అలాగే కేవలం 16 రోజుల్లోనే ఈ మూవీ 1000 కోట్ల క్లబ్లో కూడా చేరి చరిత్ర తిరగరాసింది.
మొత్తానికి ఒకే సినిమాతో ఇద్దరు బడా హీరోలు హిట్ అందుకుని ఫుల్ జ్యోష్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఇష్ట దైవం మొక్కు తీర్చుకునేందుకు సీజన్ కాకపోయినా అయ్యప్ప మాల ధరించి దీక్ష చేపట్టారు. అయితే ఇప్పుడు చరణ్ బాటలోనే ఎన్టీఆర్ కూడా స్వామి మాల వేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట.
ఎన్టీఆర్ తన ఇష్ట దైవం ఆంజనేయ స్వామి మాల ధరించడానికి సిద్ధమయ్యారట. 21 రోజులు ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి దీక్షలో ఉండబోతున్నారని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలీదు గానీ.. ఎన్టీఆర్ ఇప్పటి వరకు దీక్షలు తీసుకున్న దాఖలాలైతే లేవు.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్` తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. జూన్ నుండీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.