RRR: “ఆర్ఆర్ఆర్” తిరుగులేని హిట్ కొట్టిన గాని ఎన్టీఆర్ అభిమానులు డైరెక్టర్ రాజమౌళి పై ఒక విషయంలో అసహనం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేంటో కాదు సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కంటే చరణ్ పాత్ర కి.. ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించిందని. కావాలని ఎన్టీఆర్ కి పాత్ర తగ్గించారని.. అభిమానులు మండిపడుతున్నారు అన్న వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి.
పైగా సినిమాల్లో ఎన్టీఆర్ కంటే చరణ్ హైలెట్ అయ్యారని అన్న టాక్ కూడా బలంగా వినబడుతుంది. ఇటువంటి తరుణంలో వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. “ఆర్ఆర్ఆర్” లో ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించారని తెలిపారు. తన పాత్రకు సంబంధించి ఎటువంటి అసహనం లేదని..క్లారిటీ ఇచ్చారు. రెండు పాత్రలు కూడా అద్భుతంగా ఉన్నాయి అని.. ఏ ఒక్కరినీ తక్కువ చేయలేదని.. అందువల్లే “ఆర్ఆర్ఆర్” అందంగా తీర్చిదిద్దబడింది అని వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఫస్టాఫ్ లో చెలరేగిపోయారు.
ముఖ్యంగా “కొమరం భీముడో” అనే పాటలో తారక్ ఇచ్చిన హావా భావాలకు థియేటర్ లో చిన్న పిల్లలు ఆడవాళ్లు కంట నీరు పెట్టుకున్నా సందర్భాలు ఉన్నాయి. ఆడియన్స్ పరంగా అభిమానులు ఎన్టీఆర్ లో నట విశ్వరూపం కనబడిందని తెలియజేశారు. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి ఎన్టీఆర్.. పాత్ర పెద్దగా కనిపించలేదు అని అదే లోటని.. ఎన్టీఆర్ అభిమానులు నిరుత్సాహం చెందారు అని.. రాజమౌళి కావాలని ఎన్టీఆర్ పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు ఫాన్స్ భావించినట్లు వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో రెండు పాత్రలను సరిసమానంగా జక్కన్న చెక్కాడు.. అంటూ ఎన్టీఆర్ కామెంట్లు చేయడంతో… వివాదాలకు పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.