NTR: నందమూరి హరికృష్ణ హీరోగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే `సీతయ్య`. సౌందర్య, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించారు. రాయలసీమ నేపథ్యంలోనే రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2003 ఆగష్టు 22న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సీతయ్యగా హరికృష్ణ తన నటన విశ్వరూపం చూపించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తా అంటూ హరికృష్ణ తనయుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్స్ చేశాడు. పూర్తి వివారల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ రామ్ చరణ్తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేసిన `ఆర్ఆర్ఆర్` చిత్రం మార్చి 25న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగానే నిన్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.. లైవ్లో ఎన్టీఆర్, రామ్ చరణ్లతో కలిసి చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా హీరోలిద్దరి నుంచీ ఎన్నో విషయాలను రాబట్టిన కీరవాణి.. `సీతయ్య` సినిమా ప్రస్తవాన తీసుకువచ్చారు. సీతయ్య సినిమాలో `ఒక్కమగాడు` సాంగ్ నాకు ఎంతో ఇష్టం. మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్ చేస్తే నువ్వు నటిస్తావా..? అంటూ కీరవాణి ప్రశ్నించాడు.
అందుకు ఎన్టీఆర్ బదులిస్తూ.. మళ్ళీ మీరే మ్యూజిక్ ఇస్తానంటే సీతయ్య సీక్వెల్ చేయడానికి నేను రెడీ అని చెప్పేశారు. నేటి పరిస్థితులుకు అనుగుణంగా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తే ఆ మూవీ రీమేక్లో నటించడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని ఎన్టీఆర్ పేర్కొనడంతో.. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.