NTR-Rajamouli: దర్శకుడు రాజమౌళిపై చెప్పినట్లుగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పగ తీర్చుకున్నాడు. వీరిద్దరి మధ్య పగేంటో తెలియాలంటే లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. దాదాపు నాలుగేళ్లు రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా.. అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇకపోతే ఈ సినిమాలోని `నాటు, నాటు` సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట కోసం చరణ్, తారక్లు వేసిన స్టెప్పులు థియేటర్స్లో ఈలలు వేయించాయి. అయితే ఈ సాంగ్ షూట్ సమయంలో మాకు రాజమౌళి తన రాక్షసత్వం చూపించాడని.. కాళ్లతో వేసే స్టెప్ మాతో ఏకంగా పదిహేడు టేక్లు చేయించి, చివరాఖరకు రెండో టేక్ను ఫైనల్ చేశాడని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత జరిగే సక్సెస్ పార్టీలో రాజమౌళి చేత నాటు నాటు స్టెప్ వేయించి.. అప్పుడు పగ తీర్చుకుంటామని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అయితే ఆయన అనంత పని చేశాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ నైజాం పంపిణీదారుడు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. చిత్ర టీమ్కి స్పెషల్ విందు ఏర్పాటు చేసి, సక్సెస్ సెలబ్రేషన్స్ చేశారు.
అయితే ఈ పార్టీలో రాజమౌళితో ‘నాటు నాటు’ పాటకు టీమ్ అంతా స్టెప్పులు వేయించారు. ఆయనతో పాటు అనిల్ రావిపూడి కూడా కాలు కదిపారు. స్టేజ్పై ఉన్న రాజమౌళి, అనిల్ రావిపూడిలకు ఎన్టీఆర్ యాక్షన్ చెప్పి బరిలో దింపాడు. అయితే ఓ చోట పాటకు డాన్స్కు సింక్ కుదరకపోవడంతో ఎన్టీఆర్ మళ్లీ రీటేక్ చెప్పి. వా. స్టెప్పులు వేయించారు. మొత్తానికి ఫుల్ ఫన్నీగా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
https://www.instagram.com/tv/Cb9AMQIlWAf/?utm_source=ig_web_copy_link