NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల “తెల్లారితే గురువారం” అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. కీరవాణి కొడుకులు సింహ, భైరవ కి చెందిన సినిమా కావటంతో ఎన్టీఆర్ కీలక కామెంట్ చేశారు. తన మంచిచెడులు అదే విధంగా కష్టం సమయాలలో తన వెన్నంటి ఉన్న కుటుంబం రాజమౌళి కీరవాణి కుటుంబం అని పేర్కొన్నారు.
తన తండ్రి తరువాత తనకి ఉన్న కుటుంబం కూడా ఇదే అని స్పష్టం చేశారు. సో ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా రావటం జరిగిందని.. చాలా కార్యక్రమాల్లో పాల్గొన్న ఈ కార్యక్రమంలో మాట్లాడుతుంటే టెన్షన్ వస్తుంది అని ఎన్టీఆర్ అన్నారు.
సింహా, భైరవ కచ్చితంగా సక్సెస్ సాధించాలని, రాబోయే జనరేషన్ కి ఆదర్శంగా నిలవాలి అంటూ ఎన్టీఆర్ సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు సీఎం సీఎం అంటూ కామెంటు చేయటంతో ఎన్టీఆర్ .. వాళ్లు చేసిన వ్యాఖ్యలకు షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ఆగండి బ్రదర్ .. ఒక్కసారి స్టాప్ చేయండి, అంటుండగానే మరీ అరవటం తో ఒక్కసారిగా ఎన్టీఆర్ సీరియస్ అయ్యి ఆపమని చెబుతున్నాను అంటూ గట్టిగా రియాక్ట్ కావటంతో ఒక్కసారి అందరూ సైలెంట్ అయిపోయారు. దీంతో ఈ వార్త ఇటు రాజకీయ రంగంలోనూ అటు సినిమా రంగంలోనూ సంచలనం సృష్టించింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ అట్టడుగు స్థాయికి పడిపోవటంతో ఇలాంటి టైం లో ఎన్టీఆర్ వస్తే గాని పార్టీ సెట్ రైట్ అవుతుంది అని చాలా మంది కార్యకర్తలు మరియు టిడిపి పార్టీకి చెందిన సీనియర్ నేతలు గత కొంత కాలం నుండి వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో కూడా అక్కడి పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ నీ మళ్లీ పార్టీలోకి తీసుకోవాలి అంటూ బాబు కి సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ మాత్రం తన దృష్టి మొత్తం సినిమాలపై ఉందని రాజకీయాలపై లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!