Trivikram: దర్శకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మొదటి సినిమా “నువ్వే నువ్వే” రిలీజ్ అయ్యి ఇటీవల 20 సంవత్సరాలు కావడంతో స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో తరుణ్ తో పాటు హీరోయిన్ శ్రేయ ఇంకా ప్రకాష్ రాజ్ దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఇంకా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాట్లాడుతూ కేవలం నాలుగు సిగరెట్లు కాల్చేలోపే ఈ స్టోరీ మొత్తం నిర్మాత స్రవంతి రవి కిషోర్ కి చెప్పాను. వెంటనే ఆయన కారులో చెక్ బుక్ తీసి అడ్వాన్స్ ఇచ్చారు. మొన్ననే సినిమా చేసినట్టు ఉందని .. అనేక విషయాలు తెలియజేయడం జరిగింది.
అంతేకాదు ఇండస్ట్రీలో అప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో ఎదుర్కొన్న అనేక కష్టాలు చాలా ఆహ్లాదకరంగా త్రివిక్రమ్ వివరించారు. తన లైఫ్ లో స్రవంతి రవి కిషోర్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఇక ఇదే సందర్భంలో ప్రకాష్ రాజు పై త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ అంటే అందరూ చాలా భయపడతారు. కానీ ప్రకాష్ రాజు గారికి నేనంటే భయం. ఎందుకంటే అప్పట్లో నేను సునీల్ అర్ధరాత్రి ప్రకాష్ రాజ్ ఇంటి తలుపులు కొట్టే వాళ్ళం. ఇంట్లో మందు బాటిల్ లు ఎత్తుకెళ్లి పోయేవాళ్ళం. మా ద్వారా ఆయన ఎంతో దోపిడీకి గురయ్యారు. అందరికంటే మమ్మల్ని చాలా భరించాడు.
కచ్చితంగా సందర్భాలలో చూస్తే నేను చేసే పనులకు ఆయన కొద్దిగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ రైటర్ కాకముందే జరిగాయి. అర్ధరాత్రి ఆకలేస్తే ఆయన ఇంటికి వెళ్లి తినటానికి ఏదైనా ఉందా అని అడిగేవాళ్ళం. అదే సమయంలో ఆయన చేతికి వాచీ ఉంటే లాగేసుకునే రోజులవి. ఒకటి కాదు మావల్ల ఎంతో దౌర్జన్యానికి ప్రకాష్ రాజు గురయ్యారు.. ఏదో తిరుగుతున్నాం కాబట్టి జీవితంలో సెటిల్ అవుతారని ఆయన భావించి ఉంటారు అంటూ అలనాటి రోజులను.. త్రివిక్రమ్ మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇంక నువ్వే నువ్వే గురించి అనేక విషయాలు త్రివిక్రమ్ తెలియజేయడం జరిగింది.