Nuvvostanante Nenoddantana: 2005వ సంవత్సరంలో ప్రభుదేవా దర్శకత్వంలో సిద్ధార్థ హీరోగా త్రిష హీరోయిన్ గా వచ్చిన “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మళ్లీ ప్రేమికుల రోజు నాడు ఫిబ్రవరి 14వ తారీకు రీ రిలీజ్ చేయటానికి నిర్మాతలు రెడీ కావడం జరిగింది. ఎమ్మెస్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది. ప్రేమించిన అమ్మాయి కోసం ఒక ధనవంతుల కుటుంబానికి చెందిన కొడుకుగా ఉండే సిద్ధార్థ ప్రేయసి కోసం పల్లెటూరులో వ్యవసాయం చేసి ఆమె అన్నయ్యని మెప్పించడం ఈ సినిమా యొక్క కథ అంశం.
ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ చాలా హైలెట్ అయింది. సినిమాలో అన్ని పాటలు కూడా సంగీత ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంటాయి. సినిమా దర్శకుడు ప్రభుదేవా సైతం ఓ సాంగులో కనిపించడం జరుగుతుంది. మొదట తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఆ తర్వాత తొమ్మిది భాషల్లో తెరకెక్కింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం నాడు విడుదల చేయడానికి సిద్ధం కావడం జరిగిందట. ప్రస్తుతం చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు నాటి నుంచి ఈ రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ కావడం జరిగింది.
ఈ క్రమంలో బడా హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి. కొన్ని పుట్టినరోజు సమయంలో మరికొన్ని సంవత్సరాలు పురస్కరించుకున్న క్రమంలో.. రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తారీకు ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మళ్లీ విడుదల చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో శ్రీహరి నటన హైలెట్. సునీల్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి తమ కామెడీతో ఏంతగానో ఆకట్టుకుంటారు.