Olivia Morris: హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` సినిమాతో ఒలీవియా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఎన్టీఆర్కు జోడీగా జెన్నీఫర్ అలియాస్ జెన్నీ అనే బ్రిటిష్ యువతి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిందీ బ్యూటీ.
మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజైన ఈ మూవీ.. భారీ విజయం సాధించింది. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే ఒలీవియా మోరిస్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఒలీవియా మాట్లాడుతూ.. ఫస్ట్డేనే తన బాయ్ఫ్రెండ్తో ఈ సినిమా చూశాను. కోమురం భీముడో పాటలో తారక్ ను చూసి ఏడ్చేశా. ఇందులో మరిన్ని సన్నివేశాలు నన్ను భావోద్వేగానికి గురి చేశాయి అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తారక్ తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన చాలా గొప్ప నటుడు,సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని పొగడ్తలతో ముంచెత్తింది.
రాజమౌళి అద్భుతమైన డైరెక్టర్ అని కూడా కొనియాడింది. ఇక చరణ్ మంచి స్నేహితుడయ్యాడని, తామిద్దరం లండన్ లోని పరిసరాల గురించి మాట్లాడుకునేవాళ్లమని తెలిపింది. అంతేకాదు, ఈ మూవీలో నాటు నాటు పాట బాగా ఇష్టమని.. ఈ పాటకు తన బాయ్ ఫ్రెండ్ డ్యాన్స్ ట్రై చేస్తున్నాడని చెప్పింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.