Mahesh Bollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సారథ్యంలో అడవి శేష్ హీరోగా “మేజర్” సినిమా తెరకెక్కుతోంది. జూన్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే “మేజర్” సినిమా ట్రైలర్ నీ ఇటీవల మహేష్ బాబు రిలీజ్ చేయడం తెలిసిందే. ఆ సమయంలో విలేకరులు మహేష్ బాబుని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాన్ ఇండియా, బాలీవుడ్, హిందీ సినిమాల ప్రస్తావన రాగా.. మహేష్ ఇచ్చిన జవాబు అనేక విమర్శలకు దారి తీయడం తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీ తనని భరించలేదని, హిందీ లో అనేక ఆఫర్లు వచ్చాయని.. కానీ హిందీ టైం వేస్ట్.. తెలుగులో మంచి కంఫర్ట్ ఉందని మహేష్ చెప్పిన జవాబు పలు విమర్శలకు దారితీసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలో మహేష్ వ్యాఖ్యలు బీ టౌన్ లో వైరల్ గా మారాయి. మహేష్ బాబు చేసిన కామెంట్లకు కొంతమంది సపోర్ట్ చేయగా… చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు వ్యతిరేకించారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ ని అతిగా ప్రేమించే జనాలు.. ఓ విషయంలో మహేష్ బాబుని ప్రజెంట్ గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. అదేమిటంటే పాన్ మసాలాకు సంబంధించిన యాడ్ ఒకటి మహేష్ బాబు గత ఎడాది చేయడం జరిగింది. దీంతో ఆ యాడ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీ భరించలేకపోయిన పాన్ మసాలా మహేష్ బాబు ని భరిస్తోంది అని భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జనాల ఆరోగ్యాన్ని … దెబ్బతీసే పాన్ మసాలా మాత్రమే మహేష్ బాబు ని భరించగలదు అని ఎటకారం ఆడుతున్నారు.
మరికొంతమంది మహేష్ నీ పాన్ మసాలా సూపర్ స్టార్, పాన్ మసాలా కోసం యాడ్ చేయడం మహేష్ కి హాలీవుడ్ లో పని చేయడంతో సమానం, మరికొంతమంది పాన్ మసాలా ప్రొడక్ట్స్ అమ్ముకునే స్టార్… అంటూ సోషల్ మీడియాలో మహేష్ బాబు ని గట్టిగా బాలీవుడ్ జనాలు ట్రోల్ చేస్తున్నారు. ఇటీవలే పాన్ మసాలా యాడ్ కి సంబంధించి షారుక్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లపై భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీ తనను భరించలేదని.. మహేష్ కామెంట్ చేయటంతో.. పాన్ మసాలా యాడ్ నీ అడ్డం పెట్టుకుని మహేష్ బాబు ని గట్టిగా బాలీవుడ్ జనాలు ట్రోల్ చేస్తూ… విమర్శిస్తున్నారు. మరోపక్క బాలీవుడ్ పై కామెంట్ల విషయంలో ఉద్దేశపూర్వకంగా.. తను ఏమి అనలేదని తప్పుగా అర్థం చేసుకున్నారని మహేష్ వివరణ ఇచ్చారు. అయినా కానీ బాలీవుడ్ జనాలు మాత్రం.. మహేష్ ని గట్టిగా టార్గెట్ చేయడం సంచలనంగా మారింది.