Okkadu: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా “రాజకుమారుడు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు..”ఒక్కడు”తో కెరియర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవటం తెలిసిందే. 2003వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా మహేష్ బాబుకి మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ హీరోగా భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యి మహేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.
సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం.. మరింత హైలెట్ గా నిలిచింది. ఈ క్రమంలో వచ్చే ఏడాదికి ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి సినిమా రీ రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత ఎమ్మెస్ రాజు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జనవరి 8వ తారీఖు నాడు 4K ప్రింట్ తో “ఒక్కడు” ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని పేర్కొన్నారు. తెలుగు సినిమా రంగంలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతూ ఉంది. ఈ ట్రెండ్ మహేష్ బాబు అభిమానులే స్టార్ట్ చేశారు.
గత నెల మహేష్ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పోకిరి సినిమా 4K టెక్నాలజీతో స్పెషల్ షోలు వేసుకోవటం జరిగింది. ఆ తర్వాత పవన్ ఇంకా చిరంజీవి పుట్టినరోజు నాడు వాళ్ళ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు లేటెస్ట్ టెక్నాలజీతో స్పెషల్ షో వేసుకున్నారు. ఈ క్రమంలో “జల్సా” రీ రిలీజ్…కి భారీ ఎత్తున కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఇప్పుడు ఇదే తరహాలో మహేష్ ఒక్కడు సినిమా విడుదలయ్యి 20 సంవత్సరాలు వచ్చే ఏడాది కావస్తుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ షోలు 4k టెక్నాలజీ ప్రింట్ తో వేస్తున్నట్లు నిర్మాత ఎమ్మెస్ రాజు స్పష్టం చేశారు.