Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ మహేష్కు జోడీగా నటించగా.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రను పోషించారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అలాగే తమన్ స్వరాలు అందిస్తుండగా.. సమ్మర్ కానుకగా మే 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే ఇప్పటికే బయటకు వచ్చిన `కళావతి`, `పెన్నీ` సాంగ్స్ విశేషకంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో బ్లాస్ట్ రాబోతోంది. అదే థర్డ్ సింగిల్. మాంచి మాస్ బీట్ ఉన్న థర్డ్ సింగిల్ను విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా చిత్ర సంగీత దర్శకుడు థమన్ పేర్కొన్నాడు. ఈ అప్డేట్తో మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడు సర్కారు వారి మూడో పాట బయటకు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కాగా, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ తనయుడిగా కనిపించబోతున్నాడు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు.