తెలుగులో సెన్సేషనల్ హిట్ అయిన `అర్జున్ రెడ్డి` చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్లో కబీర్ సింగ్.. తమిళంలో ఆదిత్య వర్మ అనే పేర్లతో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. `కబీర్ సింగ్` జూన్ 21న విడుదల కానుంది. కాగా `ఆదిత్య వర్మ`
ను జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ తమిళ రీమేక్ ఎందుకనో ఇప్పటికే చాలా కష్టనష్టాలను దాటి ముందుకొచ్చింది. ఇప్పుడు తమిళ రీమేక్కి ఓ సమస్య మొదలైంది. ముందుగా దర్శకుడు బాల సినిమాను డైరెక్ట్ చేశాడు. కానీ నిర్మాతలలకు, బాలాకు మధ్య గొడవలు రావడంతో డైరెక్టర్ను మార్చేసి కొత్తగా సినిమాను మరో డైరెక్టర్తో రూపొందించుకున్నారు. అయితే ఇప్పుడు దర్శకుడు బాలా తను డైరెక్ట్ చేసిన సన్నివేశాల్లో ఒకదాన్ని కూడా వాడుకోకూడదని, అలా వాడుకుంటే లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నాడట. మరి దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి. విక్రమ్ తనయుడు ధ్రువ్ ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు. ధ్రువ్ డెబ్యూ మూవీ ఇది.