మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`.. చైనా షెడ్యూల్కు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతానికైతే ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారనే వార్తలు వినపడుతున్నాయి. చిరంజీవి మే నెలలో రెస్ట్ తీసుకుని.. కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ సినిమాను స్టార్ట్ చేస్తాడు. ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధమైంది.
సామాజిక కోణంలో మెసేజ్ ఓరియెంటెడ్గా కమర్షియల్ విలువలతో ఎప్పటిలాగానే కొరటాల ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై సినిమా నిర్మితమవనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలని యూనిట్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ లిస్టులో నయనతార, అనుష్క పేర్లు ప్రముఖంగా వినపడ్డాయి. అయితే ఇప్పుడు ఈ రేసులో మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె ఎవరో కాదు.. కీర్తి సురేష్. `దర్బార్`చిత్రంలో రజనీకాంత్తో నటిస్తోన్న కీర్తిసురేష్కున్న క్రేజ్ దృష్ట్యా, యూనిట్ ఆమెతో కూడా సంప్రదింపులు చేస్తున్నారట. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఫైనల్ అవుతారో తెలియడం లేదు. ఈ చిత్రంలో మరో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఓ కీలక పాత్రను పోషించబోతున్నారని టాక్.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!