Trisha Krishnan : త్రిష ఒకప్పుడు తెలుగులో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న వారిలో ఒకరని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమెకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో తమిళం, వైపు దృష్టి మరలించింది. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ల లిస్టులో ఉన్న త్రిష ఇప్పుడు పూర్తిగా సినిమా అవకాశాలు రావడం తగ్గిపోయాయి.అందుకు గల కారణం ఈమె నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని చెప్పవచ్చు.
ఏఎం రత్నం నిర్మించిన”నీ మనసు నాకు తెలుసు”అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన త్రిష తాను నటించిన మొదటి సినిమానే పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన “వర్షం”సినిమాలో ప్రభాస్ తో జతకట్టి ఆడిపాడింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో “ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన” అనే పాట ఇప్పటికీ వర్షం పడితే చాలు ఆ పాటను తలుచుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు.
ప్రభాస్ నటించిన వర్షం సినిమా బ్లాక్ బస్టర్ విజయవంతం కావడంతో తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. వర్షం తర్వాత అతడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో విజయవంతం కావడంతో త్రిష రేంజ్ మారిపోయింది. తర్వాత వరుస అపజయాలు రావడంతో త్రిషకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో నటించే అవకాశం రావడంతో కొన్ని కారణాల వల్ల ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా కాజల్ అగర్వాల్ ను వరించింది. ఈ విధంగా త్రిష తెలుగు లో ఒక భారీ ఆఫర్ ను మిస్ చేసుకుందని చెప్పవచ్చు.
త్రిష పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది:
త్రిష తన సినీ కెరీర్ లో 60వ చిత్రంగా తెరకెక్కిన కోలీవుడ్ చిత్రం “పరమపథం విలయాట్టు”. ఈ సినిమాకు తిరుగ్ననం దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్స్ నిర్మించింది. కరోనా సమయంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా ప్రతిసారి వాయిదా పడుతూ వస్తోంది. కరోనా వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు చెక్క పడటంతో చిత్రబృందం ఈ సినిమా థియేటర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేయడంతో త్రిష ఎంతో సంబరపడిపోయింది.
అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీ రిలీజ్ చేస్తున్నారట. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న త్రిష కాస్త నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుందట. ఈ విధంగా త్రిష నటించిన సినిమా థియేటర్లో కాకుండా ఓటీటీ లో విడుదల కావడంతో పాటు అభిమానులు కూడా ఎంతో డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది. మరికొందరు త్రిష పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది తెగ ఫీల్ అవుతున్నారు.