2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓయ్ సినిమా గురించి అందరికి తెలిసిందే. సిద్ధార్థ్, బేబీ షామిలి జంటగా నటించిన ఈ సినిమాకు ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేదు.. అలా అని బాలేదనలేం. సరికొత్త ప్రేమ కథా చిత్రంగా కొంతమంది అభిమానుల మనసుని దోచించింది. సినిమాలో పాటలు హైలైట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆనంద్ రంగా సినిమాలు తీయలేదు. కానీ 11 ఏళ్ల తర్వాత ఒక సరికొత్త కాన్సెప్ట్ తో మళ్లీ అభిమానుల ముందుకు రాబోతున్నారు.
20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆనంద్ రంగా ఓయ్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారు. ఆ ప్రొడక్షన్ లో పొగ అనే సినిమాను తీశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ సినిమా థియేటర్ లోకి రాలేదు. మధ్యలోనే ఆగిపోయింది.
ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తుండటంతో షూటౌట్ ఎట్ ఆలేర్ అనే వెబ్ సిరీస్ ను డైరెక్ట చేస్తున్నాడు. ఒక టెర్రరిస్ట్ పక్కాగా ప్లాన్ చేసి పోలీసులను చంపేస్తుంటాడు. అలాంటి ఈ కేసులు ఆఫీసర్స్ ఎలా డీల్ చేస్తారనేది ఈ వెబ్ సిరీస్ ముఖ్య ఉద్దేశం. ఈ వెబ్ సిరీస్ లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
త్వరలో ఈ వెబ్ సిరీస్ జీ5 లో విడుదల కానుంది. ఈ వెబ్ సిరీస్ తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఆనంద రంగా తన వంతు కృషి చేస్తున్నారు. ఈ సిరీస్ సక్సెస్ అయితే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆనంద్ రంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఓయ్ సినిమా మిశ్రమ ఫలితాన్ని సాధించింది.