దేశ మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ పాయ్ బయోపిక్ ‘మై రహూ యా నా రహూ ఏ దేశ్ రెహనా చాహియే-అటల్’ అనే టైటిల్ పేరిట తెరకేకనున్న సంగతి తెలిసిందే. వినోద్ బన్సాలి, సందీప్ సింగ్ ఈ సినిమాని నిర్మించనున్నారు. బిజెపి పార్టీ నాయకుడిగా.. ఎన్డీఏ ప్రభుత్వానికి అధినాయకుడిగా.. దేశ ప్రధానిగా వాజ్ పాయ్.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు వక్తగా కూడా మంచి పేరుంది. ఉల్లేక్ ఏన్పీ రాసిన ‘ది అన్టోల్డ్ వాజ్పేయి: పొలిటీషియన్ అండ్ పారాడాక్స్’ పుస్తకం ఆధారంగా వాజ్ పాయ్ బయోపిక్ తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో వాజ్ పాయ్ పాత్రలో ఎవరు నటిస్తారు అనేది డిస్కషన్ ఎప్పటినుండో జరుగుతున్నాయి.
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి తాజాగా వినపడుతున్న సమాచారం ప్రకారం పంకజ్ త్రిపాఠి నటించనునట్టు సమాచారం. వాజ్ పాయ్ హయాంలో దేశంలో భారీ ఆర్థిక సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన, విద్యా వ్యాప్తి వంటి విషయాలపై ప్రధానంగా దృష్టి సారించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ముఖ్యంగా దేశంలో మారుమూల గ్రామాలలో కూడా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ప్రాజెక్టు ద్వారా రోడ్లు వేసిన ఘనత వాజ్ పాయ్ కే చెల్లుతుంది. బలహీన వర్గాలకు దేశవ్యాప్తంగా జిల్లాలలో సర్వ శిక్ష అభియాన్ పేరిట విద్యను అందించే పాఠశాలలను నిర్మించారు.
వాజ్ పాయ్ హయంలో విద్య విషయంలో ఆయన చేసిన రాజ్యాంగ సంస్కరణలు ఇప్పటికీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. రక్షణ రంగంలో అణు శక్తి ప్రయోగాల విషయంలో అగ్రరాజ్యాలు ఒత్తిడి చేస్తున్నకాని.. ఎక్కడ తలగకుండా.. అను పరీక్షలు విజయవంతం చేయడంలో.. కీలకంగా రాణించారు. ఇంకా టెలికాం.. విమానాయన రంగాలు వాజ్ పాయ్ హయాం లోనే బాగా అభివృద్ధి చెందాయి. ఇంతటి మహనీయుడు జీవితాన్ని ‘మై రహూ యా నా రహూ ఏ దేశ్ రెహనా చాహియే-అటల్’ అనే టైటిల్ పేరిట తెరకెక్కించి 2023వ సంవత్సరం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 25వ తారీకు విడుదల చేయబోతున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!