Parasuram: `యువత` సినిమాతో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన పరశురామ్.. `సోలో` సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత `సారొచ్చారు`తో నిరాశపరిచినా.. `శ్రీరస్తు శుభమస్తు`, `గీత గోవిందం`తో ప్రేక్షకులు బాగా చేరువయ్యాడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `సర్కారు వారి పాట`.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సముద్రఖని విలన్గా చేయగా.. తమన్ స్వరాలు సమకూర్చారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా దర్శకుడు పరశురామ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో విషయాలను షేర్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. `నేను పుట్టి పెరిగిందంతా వైజాగ్ దగ్గరున్న నర్సీపట్నంలో. డైరెక్టర్ గుణశేఖర్, పూరి జగన్నాథ్లది మా ఊరే. అందువలన వాళ్లిద్దరితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది.
ఒక్కడు సినిమాతో మహేశ్ బాబుకి గుణశేఖర్ భారీ హిట్ ఇస్తే.. పోకిరి మూవీతో మహేశ్ కి పూరీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. దాంతో నేను కూడా ఎప్పటికైనా మహేశ్ తో ఒక సినిమా చేయాలనీ .. ఆయనతో కలిసి గట్టి హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాను. అది మరి కొద్ది రోజుల్లోనే నెరవేరుతుందని అనుకుంటున్నాను. సర్కారు వారి పాటతో తప్పకుండా హిట్ కొడతానని నేను బలంగా నమ్ముతున్నా` అంటూ పరశురామ్ పేర్కొన్నారు. ఈయన మాటలతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.