సూపర్ స్టార్ మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో నటించిన “సర్కారు వారి పాట” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మే 12వ తారీకు విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అల్లరించింది. బ్యాంకు తోపిడి నేపథ్యంలో… దేశాన్ని కొల్లగొట్టే బడా బాబులను ఉద్దేశించి.. తీసిన ఈ సినిమా చాలా మందికి నచ్చింది. మహేష్ మేక్ ఓవర్ కొత్తగా ఉండటంతో పాటు.. డైలాగులు కూడా కొత్తగా చెప్పడం… ఎంతో మందిని ఆకట్టుకుంది.
మహేష్ కెరియర్ లోనే రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. అటువంటి ఈ సినిమాపై సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు మహేష్ మరియు హీరోయిన్ కీర్తి సురేష్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయని రివ్యూ ఇచ్చారు. ఇదే కామెడీ సన్నివేశాలు మరింతగా సినిమాలో పెంచి ఉండి ఉంటే సినిమా మరింతగా విజయం సాధించేది అని అన్నారు. దీంతో పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
“సర్కారు వారి పాట” సినిమాకి ముందు ఇదే పరుచూరి గోపాలకృష్ణ “ఆచార్య” సినిమాపై వైరల్ కామెంట్లు చేశారు. సినిమాకి ఆ టైటిల్ పెట్టకుండా ఉంటే బాగుండేది, చిరంజీవితో చరణ్ నటించకుండా ఉంటే ఇంకా బాగుండేది. చరణ్ ఫస్ట్ ఆఫ్ లో వస్తే “ఆచార్య” మరింత హిట్ అయ్యేది.. అని చెప్పకోచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు కీర్తి సురేష్ మధ్య కామెడీ సన్నివేశాలు.. ఇంకా పెడితే పెద్ద హిట్ అయ్యేది.. అని చెప్పడం విశేషం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!