Pavitra Lokesh: గత కొద్ది రోజుల నుండి నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) లకి సంబంధించి వార్తలు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. విడాకులు ఇవ్వకుండానే నరేష్.. పవిత్ర లోకేష్ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారని.. నరేష్ మూడో భార్య రమ్య(Ramya) ఆరోపించడం జరిగింది. అంత మాత్రమే కాదు నిన్న మైసూర్ లో(Mysore) ఓ హోటల్ గదిలో నరేష్, పవిత్ర లోకేష్ ఉండగా… భార్య రమ్య చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించడం తెలిసిందే. ఆదివారం ఈ చెప్పు దాడి ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు.. మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యాయి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పరిస్థితి ఇలా ఉంటే.. పవిత్ర లోకేష్.. తాజాగా పోలీసులను ఆశ్రయించారు. తన పరువు ప్రతిష్టలను మంగం కలిగించే రీతిలో కొన్ని మీడియా ఛానల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు. పనిగట్టుకుని కొన్ని మీడియా ఛానల్స్ ప్రతినిధులు.. తనని వెంబడిస్తున్నారంటూ మైసూర్ వివి పురం పోలీస్ స్టేషన్ లో పవిత్ర లోకేష్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు. అంతకుముందు పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్యపై సీరియస్ కావడం జరిగింది.
తనని కావాలని బ్యాడ్ చేయాలని కర్ణాటకలో.. నరేష్ భార్య రమ్య మీడియా సమావేశం పెట్టి ఇష్టానుసారమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందని తెలిపారు. నరేష్ తనకి ఆత్మీయుడు లాంటివాడని మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప వేరేది లేదని పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చారు. అయితే నేడు తనని మీడియా ప్రతినిధులు వెంబడిస్తున్నారని పవిత్ర లోకేష్ పోలీస్ కంప్లైంట్ పెట్టడం.. సంచలనంగా మారింది.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!