SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సందడి వాతావరణం నెలకొంది. “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ నటించిన “సర్కారు వారి పాట” నేడే రిలీజ్ అయింది. ఈ సినిమాలో మహేష్ చాలా కొత్తగా… గతాన్ని కంటే మరింత గ్లామర్ గా కనిపించడం మాత్రమే కాకుండా అదరగొట్టే డైలాగులతో రెచ్చిపోయారు. టోటల్ గా సినిమా మహేష్ వన్ మ్యాన్ షో అన్నట్టు.. “సర్కారు వారి పాట” బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రజెంట్ దూసుకుపోతోంది. సెకండాఫ్ కొద్ది పార్టీ సాగదీత సన్నివేశాలు మినహా సినిమా మొత్తం హైలెట్ అని చూసిన జనాలు అంటున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే మహేష్ “సర్కారు వారి పాట” సినిమా రివ్యూ పవర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇవ్వడం జరిగింది. సర్కారు వారి పాట నిర్మాతలలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఒకరు. నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో హరీష్ దర్శకత్వంలో పవన్ “భవదీయుడు భగత్ సింగ్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో మార్నింగ్ బెనిఫిట్ షో … మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు నమ్రత అదే విధంగా హరీష్ శంకర్ సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత తాజాగా హరీష్ సోషల్ మీడియాలో “సర్కారు వారి పాట” పై తన రివ్యూ ఇచ్చారు.
“సర్కారు వారి పాట” మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో మాదిరిగా ఉందని అన్నారు. మహేష్ ది అదరగొట్టే టైమింగ్ అని ప్రశంసించారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా… డైరెక్టర్ పరుశురాం పెట్ల అదిరిపోయే పాత్రలతో పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో అదరగొట్టారు అని అన్నారు. ఈసారి మైత్రి బ్యానర్ వారు.. ఖచ్చితంగా దిష్టి తీయించుకోవాలని తనదైన శైలిలో హరీష్ SVP రివ్యూ ఇవ్వటం జరిగింది.