Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూనే మరోపక్క సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధినేతగా పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలవా లేకపోయినా గాని ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అక్టోబర్ నుండి బస్సు యాత్ర చేయాలని అనుకున్న పవన్ దాన్ని వాయిదా వేశారు.
దీంతో సమయం దొరకడంతో ఇప్పుడు చాలాకాలం తర్వాత మళ్లీ సినిమా సెట్స్ లోకి పవన్ అడుగు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు’ అనే చారిత్రాత్మక సినిమా పవన్ చేస్తూ ఉన్నారు. ఏం రత్నం నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 50 శాతం వరకు కంప్లీట్ అయిపోయింది. మధ్యలో కరోనా రావటం ఆ తర్వాత పవన్ పొలిటికల్ గా బిజీ కావడంతో.. ఈ సినిమా షూటింగ్ మరుగున పడింది.
అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే దసరా తర్వాత అక్టోబర్ 16 వ తారీకు నుండి.. హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందట. పవన్ కళ్యాణ్ తో పాటు ముఖ్య పాత్రధారులంతా ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారట. ఏకధాటిగా షూటింగ్ జరుపుకుని.. వచ్చే ఏడాది మార్చి 30వ తారీకు ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో సినిమా మేకర్స్ ఉన్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.