రీసెంట్ గా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ యాక్టివ్ అయ్యారు. ముందు స్వతంత్రంగా పోటీ చేయాలని భావించి.. మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో పవన్ తీరును పార్టీ వర్గాలు సమర్ధించుకున్నాయి. కానీ.. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మాత్రం పవన్ ‘ఊసరవెల్లి’ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై జనసైనికులు సీరియస్ అయ్యారు. దీంతో పవన్ కు ప్రకాశ్ రాజ్ కు మధ్య దూరం పెరిగిందనే అంటున్నారు. అయితే త్వరలో పవన్ కల్యాణ్ – ప్రకాశ్ రాజ్ ఒకే చోట కలవనుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ ఒకటి.. క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా. వీటిలో వకీల్ సాబ్ మూవీలో పవన్ – ప్రకాశ్ రాజ్ కలిసి నటిస్తున్నారు. ఇందులో ఇద్దరూ న్యాయవాదులుగా కనిపిస్తున్నారు. విలన్ల తరపున వాదించే పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించబోతున్నారు. వీరిద్దరూ పాల్గొనే సన్నివేశాలు త్వరలో షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా రాజకీయంగా పవన్ ను ప్రకాశ్ రాజ్ టార్గెట్ చేయడంతో ఈ వీరిద్దరి పలకరింపులు ఎలా ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది. పవన్ ను ‘ఊసరవెల్లి’తో పోల్చడంతో ప్రకాశ్ రాజ్ పై ఇప్పటి నాగబాబు, బండ్ల గణేశ్ ఫైర్ అయ్యారు. అయితే.. వీరిద్దరి మధ్య రాజకీయాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం లేదని.. షూటింగ్ లో తమ పార్ట్ పూర్తి చేసుకుంటారనే చెప్పాలి. ఇప్పటికైతే పవన్ స్పందించ లేదు.
పవర్ స్టార్ కల్యాణ్.. అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బిజీగా గడిపేస్తున్నారు. విభిన్న రంగాలైన ఈ రెండింటిలోనూ పవన్ బిజీగానే ఉంటున్నారు. నాలుగు సినిమాలు అంగీకరించి రెండు సినిమాలను షూటింగ్ లో పెట్టారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో బిజీగానూ ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ ఏపీలో నివర్ తుఫానుకు నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. 5వ తేదీ వరకూ పవన్ పర్యటన కొనసాగుతుంది. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో పవన్ పర్యటించనున్నారు. ఈ పర్యటన పూర్తయ్యాకే వకీల్ సాబ్ షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.