Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు మరో పక్క సినిమాలు రెండు అద్భుతంగా హాండిల్ చేస్తూ తిరుగు లేని రీతిలో దూసుకెళ్లి పోతున్నారు. ఇటీవలే “బీమ్లా నాయక్” తో బ్లాక్ బస్టర్ విజయం కూడా అందుకోవడం జరిగింది. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో 200 కోట్లు కలెక్ట్ చేసే దిశగా నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ అందులో ఒకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ కూడా చేయడం జరిగింది.
త్వరలోనే మిగతా బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా మొదలు పెట్టే ఆలోచనలో పవన్ ఉన్నారట. హరీష్ శంకర్ దర్శకత్వంలో గతంలో పవన్ నటించిన “గబ్బర్ సింగ్” బ్లాక్ బస్టర్ విజయం సాధించటంతో అదే స్థాయిలో భవదీయుడు కూడా హిట్ అవ్వాలని హరీష్ స్క్రిప్ట్ విషయంలో ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నట్లు కూడా ఇటీవల ఓ టాక్ నడిచింది.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మిర్జాపూర్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించిన పంకజ్ త్రిపాఠి… ఏ సినిమాలో విలన్ పాత్రలో చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. సమ్మర్ అయిన వెంటనే జులై మాసం నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్ సరసన హరీష్శంకర్ లక్కీ హీరోయిన్ పూజా హెగ్డే ఫస్ట్ టైమ్ నటిస్తోంది. హరీష్ ఈ మూవీలో పవన్ ని చాల పవర్ ఫుల్ గా చూపించనున్నట్లు ఇండస్ట్రీ టాక్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!