Pawan kalyan: నిన్నా మొన్నటి వరకు పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో మేకర్స్ డైలమాలో పడ్డారు. అందుకే జనవరి 7న రిలీజ్ చేయాల్సి ఉన్న ఈ సినిమాను పోస్ట్ పోన్ కావడం..మళ్ళీ పరిస్థితులు ఎప్పుడు అదుపులోకి వస్తాయో తెలియక కొత్త విడుదల తేదీలను పరిశీలించడంలో మేకర్స్ కొంత గందరగోళానికి లోనయ్యారు. దీనికి మరో కారణం ఆర్ఆర్ఆర్ సినిమా చుట్టూ అన్నీ పెద్ద సినిమాలు కూడా రిలీజ్కు రెడీగా ఉండటమే. మొత్తానికి ఈ సినిమాను మార్చ్ 18, ఏప్రిల్ 28 అనుకున్న తేదీలను కాకుండా మార్చ్ 25వ తేదీని ఫిక్స్ చేసుకున్నారు. ఏమాత్రం మార్పు లేకుండా అదే 14 భాషలలో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 25న భారీ స్థాయిలో విడుదల చేయబోతోంది ఆర్ఆర్ఆర్ బృందం.
అయితే, ఇప్పుడు భీమ్లా నాయక్ చిత్రబృందం డైలమాలో పడింది. జనవరి 12న భారీ స్థాయిలో రావాలనుకున్న ఈ మల్టీస్టారర్ సినిమాను వాయిదా వేసి ఫిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు ఆ తేదీని వదిలేసేలా ఉన్నారు. దీనికి రెండు కారణాలు. ఒకటి ఇంకా కరోనా థర్డ్ వేవ్ జనాలను ఇబ్బంది పెడుతుండటం ఒకటైతే..మరొకటి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉందని సమాచారం. పవన్ కళ్యాణ్ మీద చిత్రీకరించాల్సిన ఉండటం మరో కారణం. అందుకే ఇప్పుడు మేకర్స్ అన్నీ అనుకున్నట్టు పూర్తైతే ఫిబ్రవరి 25న వచ్చేస్తారరు. లేదంటే ఏప్రిల్ 1వ తేదీని ఫిక్స్ చేసుకుంటారు.
Pawan kalyan: దాదాపు ఏప్రిల్ 1కే మేకర్స్ ఫిక్స్..
అందుకే, తాజాగా ఈ రెండు తేదీలతో కూడుకున్న పోస్టర్ను విడుదల చేసి ప్రకటించారు. మరో వారం పది రోజుల్లో భీమ్లా నాయక్ సినిమాకు వీటిలో ఒక తేదీని అధికారికంగా ప్రకటించేస్తారు. దాదాపు ఏప్రిల్ 1కే మేకర్స్ ఫిక్స్ అవుతారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియుంకి అధికారిక రీమేక్ చిత్రం. త్రివిక్రం ఈ సినిమాకు స్క్రీన్ప్లేను, డైలాగులను అందిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పిడివిప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్ పవన్ సరసన..సంయుక్త మీనన్ రానా సరసన నటిస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!