Pawan Kalyan-Sai Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తెరపై కనిపించి చాలా కాలమే అయింది. గత ఏడాది బైక్ యాక్సిండ్కు గురైన ఆయన నెమ్మదిగా కోలుకుని మళ్లీ ఇప్పుడిప్పుడే షూటింగ్స్లో పాల్గొంటున్నారు. అయితే ఈయన `వినోదాయ సీతాం` రీమేక్తో రీఎంట్రీ ఇవ్వాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. ఈ తమిళ హిట్ మూవీకి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు.
ఇప్పుడు తెలుగులోనూ సముద్రఖనినే దర్శకత్వం వహించబోతుండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్రను పోషించబోతున్నారు. మేనమామతో సాయి ధరమ్ తేజ్ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రమిది. అందుకే ఈ మూవీ రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తుండగా.. తేజ్ ఆశలతో పవన్ నీళ్లు జల్లాడట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అసలేమైందంటే.. ఈ రీమేక్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలైలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, పవన్ కారణంగా షూటింగ్ ను సెప్టెంబర్కు షిఫ్ట్ చేశారు. పవన్ బిజీగా ఉండటం వల్ల మరో రెండు నెలలకు చిత్రీకరణను వాయిదా వేశారట మేకర్స్. అయితే దాదాపు 9 నెలలుగా ఇంటికే పరిమితమైన సాయి ధరమ్ తేజ్.. మరో నాలుగు నెలలు మేనమామ కోసం ఆగుతాడా లేక మరో ప్రాజెక్ట్పై తన దృష్టిని మల్లిస్తాడా అన్నది చూడాలి.
కాగా, మరణించిన ఓ వ్యక్తికి దేవుడు పునర్జన్మనిస్తాడు. మూడు నెలల పాటు జీవితాన్ని గడిపేందుకు అవకాశమిస్తాడు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందన్నదే వినోదాయ సీతాం చిత్ర కథ. అయితే దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించబోతుండగా.. పునర్జన్మను పొందే వ్యక్తిగా సాయి తేజ్ అలరించనున్నాడు.