Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయ నేతగా ఏపీ ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ నిత్యం ప్రజల తరుపున పోరాటాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే నేడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మత్స్య కార్మికుల హక్కుల కోసం బహిరంగ సభను ఏర్పాటు చేయగా.. అక్కడ ప్రసంగించేందుకు పవన్ వెళ్లారు.
అక్కడ ఆయనకు ఓ చేదు అనుభవం ఎదురైంది. మత్యకార సభకు ముందు పవన్ రోడ్ షో చేపట్టగా.. జనసేన కార్యకర్తలు భారీగా పోటెత్తారు. అయితే ర్యాలీలో కారుపై నిలబడి అభివాదం చేస్తుండగా.. ఓ అభిమాని వెనక నుంచి పవన్ పైకి దూసుకొచ్చాడు. ఆ దెబ్బకు బెదిరిపోయిన పవన్.. టక్కున కారుపైనే కిద్దకు జారి పడ్డాడు.
అయినప్పటికీ నవ్వుతూ పైకి లేచిన పవన్.. అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. నెటిజన్లు `అభిమానం అంటే ఆయనకు ఏమి కాకుండా చూసుకోవడం. ఆయన్ను ఇబ్బంది పెట్టడం కాదు` అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ తర్వలోనే `భీమ్లా నాయక్` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి కీలక పాత్రను పోషించగా.. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 25న విడుదల కానుంది.
#JSPForFisherman
ఇలాంటి చెత్త ఎదవ ల కోసమే పాదయాత్ర చేయడానికి భయపడేది అభిమానం అంటే ఆయనకి ఏమి కాకుండా చూసుకోవడం మన వల్ల ఆయన ని ఇబ్బంది పెట్టడం కాదు…#PawanKalyan pic.twitter.com/2Z1xsIvEZb— Sathish koppineedi (@svksathish) February 20, 2022