Pawan kalyan: రాజకీయాలలోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ వరుస గా రీమేక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి రెండు హిట్స్ అందుకున్నారు. ‘వకీల్ సాబ్’ బాలీవుడ్ హిట్ సినిమా అమితాబ్ – తాప్సీ నటించిన ‘పింక్’ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్కు మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. దీని తర్వాత పవన్ మరో రీమేక్ చిత్రాన్ని చేశారు. మలయాళ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. దీని ఆధారంగా పవన్ చేసిన తాజా చిత్రం ‘భీమ్లానాయక్’. రానా – నిత్యా మీనన్ – సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులుపుతోంది.
ఇదే క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో రీమేక్ మూవీ చేసేందుకు రెడీ అయ్యారట. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద తమిళ సూపర్ హిట్ సినిమా ‘వినోదాయ సితం’ రీమేక్ చేయనున్నట్టు తాజా సమాచారం. ఇటీవలే ఈ మూవీ రీమేక్ హక్కుల్ని పవన్ సొంతం చేసుకున్నారు. దీనిని తన ఓన్ బ్యానర్లో మేనల్లుడు టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరం తేజ్తో నిర్మించ డానికి రంగం సిద్దం చేస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్. భీమ్లా నాయక్ సినిమా బాధ్యతలను అప్పగించినట్టుగానే ఈ సినిమా బాధ్యతలను పవన్ తన అత్యంత సన్నిహితుడు, అగ్ర దర్శక, రచయిత త్రివిక్రం కి అప్పగించారట.
Pawan kalyan: సాయి ధరం తేజ్తో కలిసి పవర్ స్టార్ ఈ మూవీలో కనిపించబోతున్నా రట..!
ప్రస్తుతం ఆయన తన టీంతో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్లో పలు మార్పులు చేస్తున్నారని సమాచారం. భీమ్లా నాయక్ సినిమా రీమేక్ స్క్రిప్ట్కు త్రివిక్రమ్ చేసిన మార్పుల వల్లే ఇంతపెద్ద సక్సెస్ సాధించిందని అందరూ చెప్పుకుంటున్నారు. అందుకే, ఈ ప్రాజెక్ట్ కూడా త్రివిక్రం చేతిలోకే వెళ్ళింది. ఇక మరో సర్ప్రైజ్ ఏమిటంటే సాయి ధరం తేజ్తో కలిసి పవర్ స్టార్ ఈ మూవీలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. తమిళ వెర్షన్కు దర్శకత్వం వహించిన దర్శక, నటుడు సముద్రఖని తెలుగు వెర్షన్కు దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.