Pawan Kalyan: దాదాపు 15 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ సెట్స్ మీదకొచ్చింది హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో రూపొందుతున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. విజనరీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాను ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం దాదాపు రూ 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో దాదాపుగా తెరకెక్కుతున్న చిత్రాలన్నీ పాన్ ఇండియన్ స్థాయిలోనే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఛాప్టర్ 2, బాలీవుడ్లో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాల తర్వాత ఇటు సౌత్లో అటు బాలీవుడ్లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీస్పై అంచనాలు భారీగా నెలకొంటున్నాయి. మేకర్స్ ఆ అంచనాలను అందుకునేందుకు బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఇక దర్శకుడు క్రిష్ కూడా హరిహర వీరమల్లు కోసం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ బందిపోటు దొంగగా మూడు విభిన్నమైన పాత్రల్లో ముప్పై రకాల గెటప్పులలో కనిపించబోతున్నారని సమాచారం.
Pawan Kalyan: ఆ సెట్ కోసం దాదాపు రూ 2 కోట్ల వరకు ఖర్చు..!
17వ శతాబ్దం నాటి మొఘలుల కాలం కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అప్పటి పరిస్థుతులను కళ్ళకు కట్టినట్టు చూపించేందుకు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ పద్మశ్రీ తోట తరణి ఆద్వర్యంలో భారీ సెట్స్ నిర్మించారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ మీద ఓ సోలో సాంగ్ చిత్రీకరణను జరపనున్నారు. ఈ నెల 20 నుంచి పవన్ పై ఓ సాంగ్ ను షూట్ చేయనున్నా రు. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ఉంటాయట. ఇక దీని కోసమే రామోజీ ఫిల్మ్ సిటీ లో ఓ భారీ సెట్ ను కూడా నిర్మించారని ..ఆ సెట్ కోసం దాదాపు రూ 2 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. సినిమాలో ఈ సాంగ్ చాలా హైలెట్గా నిలుస్తుందట. అందుకే, అంత భారీ సెట్ వేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి అంతకంతా వీరమల్లుపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్.