లాక్ డౌన్ అనంతరం సినిమాలు వేగవంతంగా చిత్రీకరణలు పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోలందరూ వారి సినిమాలలో బిజీ అయిపోయారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం పూర్తి కావడంతో తన తదుపరి ప్రాజెక్టును మొదలుపెట్టాడు.అంతేకాకుండా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా సరిలేరు నీకెవ్వరు తరువాత తను నటించబోయే “సర్కారీ వారి పాట” చిత్రం కూడా సోమవారం ఉదయం షూటింగ్ ను ప్రారంభించాయి. ఈ సినిమాలకు సంబంధించిన విషయాలను ఆయా చిత్ర బృందాలు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి మల్టీస్టారర్ గా చేస్తున్న మలయాళీ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్గా తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సాగర్ కె. చంద్ర తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న చిత్రీకరణలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నట్లు సమాచారం.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మిస్తుండగా, ఎస్ ఎస్ తమన్ స్వరాలను సమకూరుస్తున్నాడు.
ఇక ప్రిన్స్ మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రాన్ని కూడా సోమవారం ఉదయం చిత్రీకరణ ప్రారంభించారు. ఈ చిత్రాన్ని సోమవారం దుబాయ్ లో ప్రారంభించారు.సర్కారీ వారి పాట చిత్రంలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణం ప్రారంభం అయిందని తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా ఓ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!