Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రానా మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సితార నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ అందిస్తూ ఉన్నారు. “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ గా వస్తున్న ఈ సినిమా… మలయాళం మాదిరిగా ఉండదని రానా దగ్గుబాటి తెలిపారు. డైలాగ్స్ డ్రామా తరహాలో స్క్రిప్ట్ తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చడం జరిగిందని స్పష్టం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా ఫుల్ మెయిల్స్ అన్న తరహాలో సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు.
దీంతో రానా దగ్గుబాటి పెట్టిన కామెంట్ కి మెగా అభిమానులు రచ్చరచ్చగా రియాక్ట్ అవుతున్నారు. మరోపక్క ఈ ఏడాది మెగా హీరోలకు సంబంధించి వరుస సినిమాలు వస్తున్న నేపథ్యంలో .. భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈరోజు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమాలో “వకీల్ సాబ్” ట్రైలర్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో… దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి ట్రైలర్ వస్తున్న క్రమంలో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నారు.
మరోపక్క ప్రస్తుతం లైన్ లో ఉన్న సినిమాల షూటింగ్ లన్నిటిని శరవేగంగా కంప్లీట్ చేసే తరహాలో షెడ్యూల్ తో పక్కా ప్లానింగ్ తో పవన్ ఉన్నాడు. “అయ్యప్పనుమ్ కోషియం” జరుగుతున్న షూటింగ్ తీరు బట్టి చూస్తే సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలో సినిమా రిలీజ్ అవడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!