Pawan Kalyan : జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ కొంతకాలం వరకు సినిమాలకు విరామం ఇచ్చాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చేస్తుండడంతో పవన్ కళ్యాణ్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే “వకీల్ సాబ్” చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్”ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే డైలాగులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించనున్నారు.
ఈ సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పాడు. అదేవిధంగా దర్శకుడు సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ లతో సినిమాలు చేయడానికి ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ లిస్టులో తాజాగా మరో సినిమా చేరింది అని చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీ డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్నట్లు సమాచారం. పవన్, పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ తెలిస్తే నరాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా “లైగర్” అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం.
పూరి, పవన్ కాంబినేషన్ లో ఇప్పటికే బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి చిత్రాలు చేశాడు. పూరి మహేష్ కోసం సిద్ధం చేసుకున్న “జనగణమన” మహేష్ తీయడానికి కుదరని నేపథ్యంలో పవర్ స్టార్ తో తీయాలని భావించినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రూపంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నట్లు తెలిపారు.ఈ విధంగా పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేయడంతో పవన్ అభిమానులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ ఈ వేసవి సెలవులకు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.