జనసేనాని పవన్కల్యాణ్ రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే నిర్మాతలు దిల్రాజు, బోనీకపూర్ కలిసి బాలీవుడ్ చిత్రం `పింక్`ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలోనూ పవన్ సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పవన్తో పీరియాడిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తారట. మెఘల్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలనుకుంటున్నారట. అందుకోసం భారీ సెట్స్ వేసి సినిమాను చిత్రీకరించాలనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఎ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మిస్తారని టాక్. 2020 ద్వితీయార్థంలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళుతుందని సమాచారం.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!