Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుసబెట్టి బ్లాక్ బస్టర్ విజయాలను సాధిస్తున్న సంగతి తెలిసిందే. వకిల్ సాబ్, బీమ్లా నాయక్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఒకపక్క రాజకీయాల్లోనూ మరోపక్క సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ విజయవంతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే సమయంలో పవన్ ఆధ్యాత్మికంగా అన్ని మతాలను గౌరవిస్తూ.. చాలా బాధ్యతగా ఉంటారు అని అందరికీ తెలుసు. అయితే ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పెషల్ పూజ సొంతంగా నిర్వహించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
మేటర్ లోకి వెళ్తే క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న “హరిహర వీరమల్లు” షూటింగ్ సెట్ లో… పవన్ కళ్యాణ్ శ్రీరామనవమి పూజ చేయడం జరిగిందట. ఈ పూజలో డైరెక్టర్ తో పాటు నిర్మాతలు మరియు సినిమా యూనిట్ కూడా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బందిపోటు దొంగ పాత్రలో నటించనున్నట్లు.. పురాతన కాలం లో.. యుద్ధవిద్యలు తరహాలో ఈ సినిమాలో పవన్. గుర్రపు స్వారీ తో పాటు.. పోరాట సన్నివేశాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అంతమాత్రమే కాదు పురాతన యుద్ధకాలం విద్యలు కూడా “హరిహర వీరమల్లు” కోసం స్పెషల్ గా ట్రైన్ కూడా పవన్ తీసుకున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ లో “ఖుషి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన ఏ.ఏం. రత్నం ఈ సినిమా నిర్మిస్తూ ఉండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా అయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో “భవదీయుడు భగత్ సింగ్” సినిమా షూటింగులో పవన్ జాయిన్ కానున్నట్లు సమాచారం.