Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీ టాలెంటెడ్ కంటెంట్ ఉన్న వ్యక్తి అని అందరికీ తెలుసు. సినిమా రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా.. విజయవంతంగా రాణిస్తున్నారు. ఎమ్మెల్యేగా కాకపోయినా గానీ రాజకీయాలను ప్రభావితం చేసే నాయకుడిగా.. ఆంధ్రాలో బలమైన నేతగా.. జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క పార్టీ పనులను చూసుకుంటూ.. దూసుకుపోతున్నారు. సినిమా ఫీల్డ్ లో హీరోగా మాత్రమే కాక డైరెక్టర్ గా రచయితిగా కూడా రాణించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో… “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మొగలుల సామ్రాజ్యం కాలం నాటి స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత హరిష్ శంకర్ దర్శకత్వంలో “భగత్ సింగ్ భవదీయుడు” అనే సినిమా పవన్ చేయనున్నట్లు మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. హరీష్ దర్శకత్వంలో ఆల్ రెడీ గతంలో పవన్ నటించిన “గబ్బర్ సింగ్” బ్లాక్ బస్టర్ కావడంతో.. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గతంలో జానీ వంటి స్టొరీలు రాయడం తెలిసిందే. కాగా ఇప్పుడు తానే మరోసారి ఓ స్టోరీ రాయడం జరిగింది అంట. ఈ ప్రాజెక్టుకి హరీష్ శంకర్ ని దర్శకుడిగా తీసుకొని తానే హీరోగా.. ఉండి.. సినిమా చేయడానికి పవన్ [ప్లాన్ చేసినట్లు.. లేటెస్ట్ టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తుంది. ఈ ప్రాజెక్టు తర్వాత “భగత్ సింగ్ బావధియుడు” సినిమా చేసే ఆలోచనలో…హరీష్, పవన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఎలక్షన్ ముందు తాను రాసిన స్టోరీ సినిమా వచ్చే విధంగా… పవన్ ప్లాన్ చేసినట్లు దీనికి హరీష్ నీ దర్శకుడిగా నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.