Bheemla Naayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో అతిపెద్ద విజయంగా “బీమ్లా నాయక్” రికార్డుల పరంపర కొనసాగిస్తుంది. ఫిబ్రవరి 25వ తారీకు రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ నీ షేక్ చేసేస్తోంది. “బీమ్లా నాయక్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో విదేశాలలో… రికార్డు స్థాయి కలెక్షన్లు రావడంతో నిర్మాతలు కూడా ఫుల్ హ్యాపీగా లాభాల్లో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా గాని పవన్ కళ్యాణ్ సినిమా వారం రోజులు కాకముందే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వటం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ సినిమా నైజాం లో గతంలో ఏ సినిమా క్రియేట్ చేయనీ రికార్డులు.. సృష్టించినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న టాక్. సినిమా సూపర్ డూపర్ హిట్ అవటంతో పవన్…”బీమ్లా నాయక్” విజయాన్ని ఆస్వాదించాలని అని ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టిన ప్రేక్షకులు ఇచ్చిన విజయానికి కృతజ్ఞతలు తెలపాలని..”బీమ్లా నాయక్” భారీ ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ వినపడుతోంది.
టిక్కెట్ల ధరల విషయంలో గతంలో మాదిరిగా ఏపీ ప్రభుత్వం.. వ్యవహరించడంతో టికెట్ ధరలు పెంచుకునే అవకాశం.. లేకుండా చేయటంతో కొద్దిగా సినిమా కలెక్షన్ లకి మైనస్ అయిందని మిగతాదంతా..సాఫీగా జరిగిందని…”బీమ్లా నాయక్” సినిమా యూనిట్ భావిస్తోంది. ఏపీలో సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తే ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.