Pawan Kalyan: తెలుగు సినిమా రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులు ఎక్కువ అని అందరికీ తెలుసు. టాలీవుడ్ చాలామంది కుర్ర హీరోలు పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులు. ఇదేవిధంగా దర్శకులు మరియు నిర్మాతలు కూడా ఆయన అంటే పడి చస్తారు. అయితే ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువగా బండ్ల గణేష్ పేరు వినబడుతుంటది. పవన్ సినిమా వేడుకలకు బండ్ల గణేష్ వేదిక ఎక్కాడంటే అభిమానులకు పూనకాలు వస్తాయి. ఆ తరహాలో స్పీచ్ ఇస్తాడు. గబ్బర్ సింగ్ మొదలుకొని బండ్ల గణేష్ స్పీచ్ లకు మంచి క్రేజ్ ఉంది.
ఇదిలా ఉంటే బండ్ల గణేష్ నిర్మాణ సారథ్యంలో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చేయటం తెలిసిందే. మొదటిది తీన్మార్ అయితే రెండవది గబ్బర్ సింగ్. ఈ రెండిటిలో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. 2012వ సంవత్సరంలో హరిశంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పవన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. మళ్లీ తర్వాత బండ్ల గణేష్ నిర్మాణ సారుద్యంలో పవన్ చేయలేదు. అయితే ఈ కాంబినేషన్ నుండి అభిమానులు ఎప్పటినుండో సినిమా ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని ఏకంగా సూసైడ్ లెటర్ రాసి… సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ లెటర్ లో రీమిక్స్ సినిమాలు వొద్దని దర్శకుడు హరిశంకర్ కి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారికి రాయడం జరిగింది. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవద్దు అని అన్నారు. అయితే ఈ లెటర్ పట్ల బండ్ల గణేష్ ట్విట్టర్ లో స్పందించారు. దయచేసి ఇటువంటి ఉత్తరాలు రాయొద్దు. మీకందరికీ మాట ఇస్తున్నాను. కచ్చితంగా మన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టే సినిమా చేస్తాను అని.. కామెంట్ పెట్టాడు. ఎంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.