Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దగ్గుబా టి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మలయాళం సూపర్ డూపర్ హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్” తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం పవన్ కుర్ర హీరోతో మల్టీ స్టారర్ సినిమాగా ఈ సినిమా చేస్తూ ఉండటం తో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అంతేకాకుండా నిత్యామీనన్, ఐశ్యర్యరాజేశ్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతున్న టైములో కరోనా మహమ్మారి రావటంతో బ్రేకులు పడ్డాయి.
వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ఆలోచన చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తనకు ఇష్టమైన యాక్టర్ నీ పట్టుబట్టి మరీ పవన్ కళ్యాణ్ పెట్టించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాలలో బ్రహ్మాజీ ఉంటుంటారు. ఆలీతో ఎటువంటి చనువు ఉందో అదే రీతిలో బ్రహ్మాజీ తో కూడా .. చాలా సన్నిహితంగా పవన్ ఉంటారని.. పవన్ కి దగ్గరగా ఉండే మనుషులు చెబుతూ ఉంటారు.
ఈ క్రమంలో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత.. ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వటంతో పవన్ కళ్యాణ్.. బ్రహ్మాజీ తో కలిసి సినిమా చేయాలని డిసైడ్ అయ్యి కావాలని.. సినిమాలో కీలక క్యారెక్టర్ బ్రహ్మాజీ కి ఇప్పించడం జరిగిందట. రానా జీప్ డ్రైవర్ పాత్రలో బ్రహ్మాజీ కనిపించనున్నట్లు లేటెస్ట్ సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్ తో జానీ, అన్నవరం, సర్దార్ గబ్బర్ సింగ్..అత్తారింటికి దారేది వంటి సినిమాలలో నటించడం జరిగింది. ఈ క్రమంలో మరోసారి పవన్ తో బ్రహ్మాజీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో..పవన్ ఫ్యాన్స్ ఈ వార్తపై తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు.