Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం `ఆచార్య`. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషించగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ మూవీకి మణిశర్మ స్వరాలు అందించారు.
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ అనేక వాయిదాల అనంతరం ఏప్రిల్ 29వ తేదీగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ఆచార్య ట్రైలర్ను ఏప్రిల్ 12న బయటకు వదలబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం రంగంలోకి దిగబోతున్నారట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రమోషన్స్లో భాగంగా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్కి డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 24న హైదరాబాద్ లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు కూడా ఇవ్వగా.. చిత్ర టీమ్ అప్పుడే ఈవెంట్కు సంబంధించిన పనులను సైతం షురూ చేసింది.
అయితే ఈ ఈవెంట్కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకధీరుడు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పెషల్ గెస్ట్లుగా రాబోతున్నారట. ఇప్పుడు ఈ విషయమే మెగా అభిమానులను ఆనందంతో ముంచెత్తుతోంది. చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్.. ఈ ముగ్గురు మెగా హీరోలు ఒకే స్టేజ్పై కనిపిస్తే ఫ్యాన్స్కు కన్నుల పండగే అవుతుంది.