Theri Movie: ఒకే కథతో పవన్ కళ్యాణ్ – వరుణ్ ధావన్ నటించబోతున్నారా..అంటే అవుననే టాక్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్లోనూ..సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన తమిళ హిట్ మూవి తేరి. ఈ సినిమా వచ్చి కూడా దాదాపు 8 ఏళ్ళు కావస్తోంది. అయినప్పటికీ సౌత్లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అంతగా తేరీ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే తేరీ మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు..దీనిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
వరుసగా రెండు రీమేక్ కథలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న పవన్ ఇప్పుడు రీమేక్ కథల కోసం ఆసక్తి చూపిస్తున్నారట. ఇక ఈ చిత్రానికి సాహో ఫేం సుజీత్ డైరెక్టర్గా ఫైనల్ అయినట్టు సమాచారం. అంతేకాదు, ఇప్పుడు తేరి హిందీలోనూ రీమేక్ చేయనున్నట్టు తాజా సమాచారం. దీనిలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ నటించనున్నారట. ఇక ఈ రీమేక్ మూవీకి ఒరిజినల్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఒకే కథ ఇటు సౌత్లో అటు బాలీవుడ్లో తెరకెక్కబోతుంటడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Theri Movie: ఈ రీమేక్ చిత్రాల్లో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేస్తారో.
ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. లయన్ అనే పేరు ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల కాకుండానే బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్ తో మరో చిత్రం కోసం అట్లీ దర్శకుడిగా ఎంపికవడం కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. విజయ్- సమంత జంటగా 2016లో వచ్చిన తేరి హిందీ రీమేక్ కు అట్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ రీమేక్ చిత్రాల్లో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేస్తారో.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?