“అర్జున్ రెడ్డి” సినిమాతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఓవర్ నైట్ లోనే స్టార్ దర్శకుడిగా పేరు సంపాదించడం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వెంటనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే సినిమాని కబీర్ సింగ్ గా తెరకెక్కించి అక్కడ కూడా అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. దీంతో మనోడు ఇప్పుడు మనోడు ఇప్పుడు రణబీర్ కపూర్ తో యానిమల్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ కలిగిన సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉండగానే ఇటీవల సందీప్ రెడ్డి వంగ… పవన్ కళ్యాణ్ కి.. చిన్న స్టోరీ లైన్ వినిపించడం జరిగిందంట. పవన్ కి నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలని కోరారు అని టాక్.
“అర్జున్ రెడ్డి” డైరెక్టర్ ని పొగడ్తలతో ముంచెత్తిన అనిల్ కపూర్..!!
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ తో చేస్తున్న సినిమా.. తర్వాత ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక పవన్ కళ్యాణ్ తో ఈ ప్రాజెక్టు ఓకే అయితే చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పైగా సందీప్ రెడ్డి వంగ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఈ విషయాన్ని చాలా సందర్భాలు సోషల్ మీడియాలో తెలియజేశారు. గతంలో పవన్ అభిమాని డైరెక్టర్ హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో పవన్ అభిమానిగా పేరు ఉన్న సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టు ఓకే అయితే బాగుంటుందని.. అభిమానులు తాజా వార్త పై రియాక్ట్ అవుతున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ .. కృషి దర్శకత్వంలో “హరిహర వీరమల్లు”, హరీష్ శంకర్ దర్శకత్వంలో “గబ్బర్ సింగ్” సినిమాలు చేస్తున్నారు. హరి శంకర్ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ కాలేదు. మరోపక్క “వినోదయ సీతం” రీమేక్ మరికొద్ది రోజుల్లో మొదలుపెట్టడానికి పవన్ రెడీ అవుతున్నారు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో పవన్ తో పాటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్టు అయిన తర్వాత పవన్.. సందీప్ రెడ్డి ప్రాజెక్టు ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.