Vinodaya Sittam: సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోగా “వినోదాయ సిత్తం” రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం మెగా కుర్ర హీరోతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ చేయటానికి ఓకే చెప్పడంతో ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే నెల నుండి ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాలో సాయి ధరంతేజ్ జీవితంలోనే సంచలనం రేపిన ఘటన పెట్టనున్నట్లు టాక్.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మేటర్ లోకి వెళ్తే కథపరంగా “వినోదాయ సిత్తం”లో కుర్ర హీరో కి కార్ యాక్సిడెంట్ జరుగుద్ది. తెలుగు రీమేక్ లో బైక్ యాక్సిడెంట్ చూపించాలని మేకర్స్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ భగవంతుడి గా కనిపించనున్నారు. అయితే తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ “వినోదాయ సిత్తం” లో కొన్ని మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కథ పరంగా కొన్ని సూచనలు త్రివిక్రమ్ ఇస్తున్నట్లు నిర్మాణం కూడా చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇదే సమయంలో త్రివిక్రమ్ భార్య కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకొనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ బిజీగా ఉండటంతో ఆయన సినిమాలకు సంబంధించి త్రివిక్రం అన్నీ తానే చూసుకుంటున్నారట. దీనికిగాను కూడా భారీ ఎత్తున పవన్ నుండి త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు మీడియాలో టాక్. “వినోదాయ సిత్తం” రీమేక్ జులై నెలలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు, ఆ తర్వాత సాయి ధరంతేజ్ సన్నివేశాలను స్పెషల్ గా చిత్రీకరించాలని సినిమా యూనిట్ అనుకుంటున్నట్లు టాక్. తెలుగులో ఇప్పటివరకు సముద్రానికి నటుడిగానే మంచి గుర్తింపు ఉంది. మరి దర్శకుడిగా తెలుగులో మొదటి చిత్రం పవన్ కళ్యాణ్ తో చాన్స్ అందుకోవడంతో సినిమా ఎలా హ్యాండిల్ చేస్తాడో..అని అభిమానులు ఉత్కంఠగా ఉన్నారు.