Charan: సౌత్ ఇండియన్ సూపర్ డుపర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవడు దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. చెర్రీ పక్కన బాలీవుడ్ టాప్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో జరుపుకుంటుంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలి, జయరాం, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఒక కీలక నటుడిని.. డైరెక్టర్ ని.. శంకర్ ఎంపిక చేసినట్లు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సరికొత్త టాక్ నడుస్తోంది. ఆయన మరెవరో కాదు ఎస్.జె.సూర్య. పవన్ కళ్యాణ్ కెరీర్లో సూపర్ డూపర్ హిట్ సినిమా “ఖుషి” సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్.జె.సూర్య తర్వాత కొమరం పులి సినిమా చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో ప్రస్తుతం సూర్య చాలావరకు విలన్ పాత్రలు చేస్తూ ఉన్నారు. మావాడు చిత్రంలో సూర్య నటించిన నటనకు.. విలన్ పాత్రకు ప్రేక్షకులు మంచి ఎంటర్టైన్మెంట్ కావడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఎస్ జె సూర్య రామ్ చరణ్ సినిమాకి సంబంధించి క్యారెక్టర్.. చాలా పవర్ ఫుల్ విలన్ పాత్ర అని… ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీ నుండి టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే సాధారణంగా శంకర్ సినిమా అంటే చాలా టైం పడుతుంది. కానీ మహమ్మారి కరోనా వైరస్ రాకతో చాలా టైం వేస్ట్ కావడంతో ఈ సినిమాని.. చాలా త్వరగా కంప్లీట్ చేయడానికి శంకర్ డిసైడ్ అయినట్లు అదేరీతిలో దిల్ రాజు.. ప్రారంభంలోనే మాట్లాడుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాదులో జరగగా ప్రజంట్ షెడ్యూల్.. రాజమండ్రిలో జరుగుతూ ఉంది.