Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాలు చేయడంలో చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేయడానికి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. దీనిలో భాగంగా రీఎంట్రీ “వకీల్ సాబ్” సినిమాతో ఇవ్వటం తెలిసిందే. బాలీవుడ్ “పింక్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన “వకీల్ సాబ్” ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది.
అయితే సినిమా రిలీజ్ అయిన కొద్దిరోజులకే రెండోసారి కరోనా ఎంట్రీ అవటంతో పరిస్థితులు మొత్తం మారిపోవడంతో కొద్దిరోజులు మాత్రమే వకీల్ సాబ్ ధియేటర్లో ఆడటం జరిగింది. థియేటర్లు క్లోజ్ అయిపోవడంతో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కలెక్షన్లు వస్తున్న టైం లో ఒక్కసారిగా కలెక్షన్లకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సినిమాని అమెజాన్ ప్రైమ్ లో నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడం జరిగింది.
Read More: Pawan Kalyan: పవన్ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలను ఖండించిన హరీష్ శంకర్..??
ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతూ ఉండటంతో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సినిమాను మరోసారి థియేటర్ లో రిలీజ్ చేయాలని కలెక్షన్లు సరిగా రాలేదని అంటున్నారట. పవన్ రీ ఎంట్రీ మూవీ కలెక్షన్ లో ఓ రేంజ్ లో ఉండాలని .. మరోసారి థియేటర్లో రిలీజ్ చేస్తే చూడటానికి అందరూ రెడీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోరుతున్నారట. దీంతో దిల్ రాజు దాదాపు 300 థియేటర్లలో మళ్లీ ‘వకీల్ సాబ్’ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట.