పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” సినిమా తో దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా టీజర్ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీగా ఉంది.
ఇలాంటి తరుణంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి సరికొత్త అప్ డేట్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో వినబడుతోంది. మేటర్ ఏమిటంటే సినిమాకి సంబంధించి శాటిలైట్ హక్కుల విషయంలో మొదటి లో జెమినీ టీవీ దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ 15 కోట్లు అనేసరికి జెమినీ టీవీ వెనకడుగు వేయడంతో తాజాగా జెమినీ టీవీ స్థానంలో జీ తెలుగు “వకీల్ సాబ్” మూవీ శాటిలైట్ హక్కులు దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఒక శాటిలైట్ బిజినెస్ విషయంలో మాత్రమే కాక థియేట్రికల్ బిజినెస్ కూడా “వకీల్ సాబ్” మూవీ రికార్డు స్థాయిలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ని తెరమీద చూడబోతున్న తరుణంలో మెగా అభిమానులు సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!