Payal Rajput: ఇటీవల కాలంలో టాలీవుడ్కి చెందిన చాలా మంది హీరోయిన్లు లిక్కర్ బ్రాండ్స్ను ప్రమోట్ చేస్తూ వార్తలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, లక్ష్మీరాయ్, హన్సిక, ఇలియానా, ప్రగ్యా జైశ్వాల్ ఇలా ఎందరో మద్యం బ్రాండ్స్కు ప్రచారం చేసి విమర్శలు పాలయ్యారు. మొన్నీ మధ్య హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ కూడా ఓ ఆల్కహాల్ బ్రాండ్ను ప్రమోట్ చేసి నెటిజన్ల చేత తిట్లు తింది.
అయితే ఈ విషయంపై తాజాగా పాయల్ స్పందించింది. లిక్కర్ బ్రాండ్ను పురుషులు ప్రమోట్ చేస్తే ఎవరు జడ్జ్ చేయరు. మరి హీరోయిన్స్ లిక్కర్ బ్రాండ్స్ను ప్రమోట్ చేస్తే తప్పేంటి అంటూ పాయల్ ప్రశ్నించింది. `ప్రభుత్వం లీగల్గా ఒప్పుకున్న ఆల్కహాల్ బ్రాండ్స్ అవి. ఇంకొకటి… మహిళలూ మందు కొడతారు, చిల్ అవుతారు. మేమూ మనుషులమే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విమర్శించే వాళ్లకు ప్రతీదీ సమస్యే. అందుకనే విమర్శలు చేసేవాళ్లను పట్టించుకోవడం మానేశాను` అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఏదైతేనేం.. విమర్శించే వారికి పాయల్ దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పింది.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. `ఆర్ఎక్స్ 100` హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకుందీ పాయల్. ఆ తర్వాత డిస్కోరాజా, వెంకీ మామ, ఆర్డీఎక్స్ లవ్ చిత్రాలతో అలరించిన ఈ భామ.. ప్రస్తుతం `ఏంజెల్’, ‘కిరాతక’, ‘గోల్ మాల్’ వంటి ప్రాజెక్టులు చేస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!