Radhey Shyam: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్ లుగా నటించిన “రాధేశ్యాం” ఈ నెల 11 వ తారీకు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. విడుదలైన ప్రతి చోట అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశవిదేశాలలో అమాంతం పెరిగిపోయింది.
ఈ క్రమంలో “బాహుబలి” తర్వాత వచ్చిన “సాహో” డిజాస్టర్ కాక ఇప్పుడు మళ్లీ “రాధేశ్యాం” అట్టర్ ఫ్లాప్ కావడం ప్రభాస్ అభిమానులను ఎంతగానో నిరుత్సాహానికి గురి చేసింది. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. వెస్ట్రన్ తరహాలో లవ్ స్టోరీ… తీయాలని డైరెక్టర్ రాధాకృష్ణ భావించగా.. సినిమాలో దమ్ము లేకపోవడంతో.. షో పడిన మొదటి నుండే నెగటివ్ టాక్ బయటకు వచ్చింది.
సినిమా ఎంత డిజాస్టర్ అయ్యింది అంటే మార్చి 11 రిలీజ్ కాగా ఏప్రిల్ ఫస్ట్ అనగా నేటి నుండే ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతున్న పరిస్థితి ఏర్పడింది. అంటే సినిమా విడుదలైన 20 రోజులకే ఓటిటి లోకి వచ్చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందు ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలు చూపించారు. కానీ అవి సినిమాలో కనబడలేదు. ఆ తర్వాత సినిమా యూనిట్ మరికొద్దిరోజుల్లో యాడ్ చేస్తామని… తెలియజేశారు, కానీ కలపలేదు. దీంతో ఇప్పుడు డిలీట్ చేసిన సన్నివేశాలు యూట్యూబ్ లేదా ఓటిటి లో అయినా చూపించాలని “రాధేశ్యాం” సినిమా యూనిట్ ని ప్రభాస్ అభిమానులు బతిమాలుతున్నారు.